దేశంలో 24 గంటల్లో 4,043 కరోనా కేసులు

71
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 4,043 కరోనా కేసులు నమోదుకాగా 9 మంది మృతిచెందారు.దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,45,43,089కి చేరగా 4,39,67,340 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 47,379 యాక్టివ్‌ కేసులుండగా 5,28,370 మంది ఇప్పటివరకు కరోనాతో మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.37శాతంగా ఉండగా ఇప్పటి వరకు 216.83కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -