దేశంలో 24 గంటల్లో 36,401 కరోనా కేసులు..

195
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 530 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,23,22,258కు చేరగా కరోనా నుండి 3,15,25,800 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,64,129 యాక్టివ్ కేసులుండగా కరోనాతో ఇప్పటి వరకు 4,33,049 మంది మృతిచెందారు.

టీకా డ్రైవ్‌లో 56.64కోట్ల డోసులు పంపిణీ చేయగా జాతీయ రికవరీ రేటు 97.53 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు 50,03,00,840 నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వెల్లడించింది.

- Advertisement -