పుస్తక ప్రియులకు…మొక్కల పంపిణీ

262
- Advertisement -

తెలంగాణ కళాభారతీ 35వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ ఘనంగా ప్రారంభించిన సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్. ఈ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణ వేత్త వేదకుమార్‌ పాల్గొన్నారు. బుక్ ఫెయిర్‌లో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో పుస్తక ప్రియులకు మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

పుస్తక ప్రేమికులకు మొక్కలు అందజేయాలన్న సంకల్పంతో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి శ్రవణ్‌…నందివర్ధనం, మల్లె, మందార, ఆక్సిజన్ ప్లాంట్స్‌తో పాటు పలు ఔషధ మొక్కలు పంపిణీ చేశారు. పర్యావరణ పరీరక్షణకు కృషి చేస్తున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌ను పుస్తక ప్రేమికులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పుస్తక ప్రేమికులు మొక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్ని వాటిని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఇవి కూడా చదవండి…

కేంద్రం…సర్వైకల్ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌

ఆక్సిజన్ స్టాక్‌ తప్పనిసరి..కేంద్రం సూచన

ఉచిత రేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం

- Advertisement -