దేశంలో 24 గంటల్లో 3011 కరోనా కేసులు

84
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో దేశంలో 3011 కరోనా కేసులు నమోదుకాగా 28 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,45,97,498కి చేరగా 4,40,32,671 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 36,126 కేసులు యాక్టివ్‌గా ఉండగా ఇప్పటివరకు కరోనాతో 5,28,701 మంది మృతిచెందారు. మొత్తం కేసుల్లో 0.08 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.73 శాతం, మరణాలు 1.2 శాతం ఉన్నాయి. ఇప్పటివరకు 218.77 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -