దేశంలో కొత్తగా 3.33 లక్షల కరోనా కేసులు నమోదు..

153
- Advertisement -

దేశంలో క‌రోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24గంటల్లో దేశంలో 3,33,533 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొన్న న‌మోదైన కేసుల కంటే నిన్న 4,171 కేసులు త‌క్కువ‌గా న‌మోద‌యాయి. అలాగే, నిన్న క‌రోనా వ‌ల్ల‌ 525 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంట‌ల్లో 2,59,168 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 21,87,205 మంది చికిత్స తీసుకుంటున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 17.78 శాతంగా ఉంది.

- Advertisement -