దేశంలో 24 గంటల్లో 21,411 కరోనా కేసులు

76
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 21,411 కరోనా కేసులు నమోదుకాగా 67 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,38,68,476కు చేరగా 4,31,92,379 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,50,100 యాక్టివ్ కేసులుండగా 5,25,997 మంది మృతిచెందారు.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతంగా ఉండగా మొత్తం కేసుల్లో 0.34 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98.46 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉండగా ఇప్పటివరకు 201.68 కోట్ల కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేశారు.

- Advertisement -