బీఆర్ఎస్‌లోకి 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు..!

42
- Advertisement -

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది బీఆర్ఎస్‌లోకి వస్తామని చెప్పారని కానీ వారిని నో చెప్పినట్లు వెల్లడించారు.

రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారన్నారు. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారు. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ను బీజేపీ వాళ్లు బతకనిస్తారా?” అని ప్రశ్నించాడు.

కాంగ్రెస్‌కు అధికారం వచ్చింది కదా అని బీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్తే ఇక్కడ అంతా బీజేపీ కథ నడుస్తుందని నాతో ఆ నాయకుడు వాపోయాడు. ఇప్పటికిప్పుడు 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ అని నన్ను సంప్రదించాడు, కానీ ఇప్పుడే వద్దని నేనే చెప్పా అని వెల్లడించారు కేసీఆర్.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..

- Advertisement -