2020 సంవత్సరానికి సంబంధించి నోబెల్ బహుమతి విజేతలను స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. వీటిలో మహిళలు తమ సత్తా చాటారు. వివిధ శాస్త్ర రంగాల్లో వరుసగా నోబెల్ ప్రైజులు ప్రకటిస్తున్నారు. గత రెండ్రోజులుగా వైద్య, భౌతిక శాస్త్ర రంగాల్లో విజేతలను ప్రకటించిన ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాజాగా రసాయనశాస్త్రంలో అవార్డుకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించింది. అమెరికాకు చెందిన జెన్నిఫర్ ఎ దౌడ్నా, ఇమ్మాన్యుయెల్లే చార్పెంటీర్ 2020కి గాను కెమిస్ట్రీలో నోబెల్ విజేతలుగా నిలిచారు. జన్యువులో మార్పులు, చేర్పులు చేసేందుకు వీలుగా వీరు ఓ కొత్త విధానానికి రూపకల్పన చేశారు.
ఓ జీవి డీఎన్ఏ జన్యుపటాన్ని సవరించడమే కాకుండా, దాన్ని నియంత్రించేందుకు జీనోమ్ ఎడిటింగ్ విధానాన్ని ఆవిష్కరించారు. ఒక విధంగా చెప్పాలంటే ఓ జీవి డీఎన్ఏను మార్చడం ఇకపై ఎంతో సులువు. అది జంతువైనా, మొక్క అయినా సరే… అత్యంత కచ్చితత్వంతో తాము కోరుకున్న జన్యువును ఎంతమేర మార్చవచ్చో అంతమేర మాత్రమే మార్పులు చేసుకోవడం సాధ్యమవుతుంది. ఫ్రాన్స్లోని జువిసీ సర్ ఓర్జ్లో 1968లో ఎమ్మాన్యువల్ పుట్టారు. బెర్లిన్లోని మ్యాక్స్ ప్లాంక్ యునిట్లో ఆమె డైరక్టర్గా చేస్తున్నారు. మరో శాస్త్రవేత్త జెన్నిఫర్ అమెరికాలోని వాషింగ్టన్లో 1964లో పుట్టారు. యూసీ బెర్క్లీలో ఆమె ప్రోఫెసర్గా చేస్తున్నారు.