దేశంలో 24 గంటల్లో 19,673 కరోనా కేసులు

18
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో 19,673 కేసులు నమోదుకాగా 45 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,40,19,811కు చేరగా 4,33,49,778 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,43,676 యాక్టివ్ కేసులుండగా కరోనాతో 5,26,357 మంది మరణించారు.

మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 204.25 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -