దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..

38
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 16,866 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా మొత్తం కేసులు 4,39,05,621కి చేరాయి. ప్రస్తుతం దేశంలో 1,50,877 యాక్టివ్ కేసులుండగా 4,32,28,670 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 5,26,074 మంది మరణించారు.

రోజువారీ పాజిటివిటీ రేటు 7.03 శాతానికి పెరుగగా మొత్తం కేసుల్లో 0.34 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98.46 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉండగా ఇప్పటివరకు 202.17 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -