మహారాష్ట్రలో మావోల ఘాతుకం…15మంది జవాన్లు మృతి

262
Mavo
- Advertisement -

మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. నిన్న రాత్రి దాదాపూర్ దాదాపు 36 వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు.. తాజాగా మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇవాళ మధ్యాహ్నం ఓ పోలీస్ వాహనంపై బాంబు విసిరారు. గడ్చిరోలిలో భద్రతాసిబ్బందితో వెళ్తున్న ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేల్చారు. ఈ దాడిలో మొత్తం 16మంది మరణించగా ..అందులో 15మంది జవాన్లు కాగా మరోకరు బస్సు డ్రైవర్ గా గుర్తించారు. కురికెడకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 mavo

- Advertisement -