దేశంలో కొత్తగా 15,388 మందికి కరోనా..

277
corona
- Advertisement -

భార‌త్‌లో కరోనా మహమ్మారి మళ్ళీ వ్యాపిస్తోంది. గత కొద్ది వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం… దేశంలో గత 24 గంటల్లో 15,388 మందికి కరోనా నిర్ధారణ అయింది.16,596 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,44,786కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 77 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,930కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,99,394 మంది కోలుకున్నారు. 1,87,462 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

- Advertisement -