దేశంలో 24 గంట‌ల్లో 14,506 క‌రోనా కేసులు..

47
covid19
- Advertisement -

దేశంలో కరోనా వైరస్‌ కోరలుచాస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గ‌త 24 గంట‌ల్లో 14,506 కేసులు న‌మోదుకాగా దీంతో మొత్తం కేసులు 4,34,33,345కు చేరాయి. క‌రోనా నుండి 4,28,08,666 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో 5,25,077 మంది మృతిచెందారు.

ప్ర‌స్తుతం దేశంలో 99,602 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.23 శాతానికి చేరాయి, రికవరీ రేటు 98.56 శాతంగా ఉంది. ఇప్పటిరకు 197.46 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -