- Advertisement -
ఏపీలో గడచిన 24 గంటల్లో 51,660 కరోనా పరీక్షలు నిర్వహించగా 124 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో 94 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అనంతపురం జిల్లాలో ఒకరు మరణించగా, కరోనా మృతుల సంఖ్య 7,172కి చేరింది. ఏపీలో ఇప్పటివరకు 8,90,441 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,369 మంది కరోనా ప్రభావం నుంచి బయటపడ్డారు. ఇంకా 900 మందికి చికిత్స కొనసాగుతోంది.
రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసులలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 30 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 18, గుంటూరు జిల్లాలో 16, తూర్పు గోదావరిలో 13, విశాఖ జిల్లాలో 13, అనంతపురం జిల్లాలో 10 కేసులు గుర్తించారు. ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
- Advertisement -