- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 2,21,725 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 11,109 కొత్త కేసులు నమోదుకాగా 19 మంది మృతిచెందారు. ప్రస్తుతం 49,622 కేసులు యాక్టివ్గా ఉండగా 4,42,16,583 మంది కరోనా నుండి కోలుకున్నారు.కరోనాతో దేశంలో ఇప్పటివరకు 5,31,064 మంది మృతిచెందారు.
ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.11 శాతం యాక్టివ్గా ఉండగా రికవరీ రేటు 98.70 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ ఎక్స్బీబీ.1.16 కారణంగా దేశంలో కరోనా కేసులు పెరుగుతుండగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -