11 మంది ప్రాణాలు బలి తీసుకున్న బస్సు..!

239
11 students killed
- Advertisement -

జమ్మూకశ్మీర్ లో విషాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళుతున్న ఓ బస్సు ప్రమాదానికి గురికావడంతో 11 మంది మరణించారు. వీరిలో 9మంది విద్యార్థినులు ఉన్నారు. మరో ఏడుగురు గాయపడ్డారు. పూంఛ్‌లోని ఓ కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థులతో బయల్దేరిన మినీ బస్సు పీర్‌కిగలీ ప్రాంతంలో లోయలో పడింది. దీంతో 11 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. గాయపడిన వారిని షోపియాన్‌ ఆస్పత్రికి తరలించారు.

ప్రమాద ఘటనపై జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -