10 ల‌క్ష‌ల మందితో టీఆర్ఎస్ విజయగర్జన..

138
trs
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భ‌వించి రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకుంటున్న‌ సందర్భంగా, టిఆర్ఎస్ నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వ‌హించనుంది. న‌గ‌ర స‌మీపంలో భారీ ఎత్తున స‌భ‌ను నిర్వ‌హించి విజ‌య‌వంతం చేసేందుకు శ్రీ‌కారం చుట్టారు. అందులో భాగంగా న‌గ‌రంలో శాయంపేట‌, భ‌ట్టుప‌ల్లి, క‌రీమాబాద్‌, తిమ్మాపురం శివార్ల‌లోని ఖాళీ స్థ‌లాల‌ను ప్ర‌భుత్వ చీఫ్ విప్ విన‌య్‌భాస్క‌ర్‌, వరంగల్ మహా నగర మేయ‌ర్ గుండు సుధారాణిల‌తో క‌లిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం ప‌రిశీలించారు.

టిఆర్ఎస్ పార్టీ విజ‌య గ‌ర్జ‌న స‌భ‌ను 10 ల‌క్ష‌ల మందితో భారీ ఎత్తున జ‌న‌స‌మీక‌ర‌ణ చేసి స‌భ‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి ఎలాంటి అటంకాలు క‌లుగ‌కుండా అన్ని హంగులతో సభ విజయవంతం కావడానికి అనువైన‌ స్థలాన్ని ప‌రిశీలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి 20 ఏ0డ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని ముఖ్య‌మంత్రి కేసిఆర్ గారు పార్టీ శ్రేణులు, ప్రజలకు నివేదిస్తారని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు.

- Advertisement -