తొలి రోజు రైతుబంధు రూ.516.95 కోట్లు జమ

109
kcr cm
- Advertisement -

అయ్యాయి. 16.95 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమకాగా నల్గొండ అత్యధికం లక్షా 11,970 రైతుల ఖాతాల్లోకి రూ.36.10 కోట్లు జమ అయ్యాయి. ఆదిలాబాద్ అత్యల్పం 9628 మంది రైతుల ఖాతాల్లోకి రూ.35.60 లక్షలు జమ అయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఎకరా వరకు ఉన్న 10 లక్షల 33 వేల 915 ఎకరాలకు చెందిన 16 లక్షల 95 వేల 601 మంది రైతుల ఖాతాలకు నిధులు విడుదల కానుండగా రెండవ రోజు రెండు ఎకరాల వరకు 23.05 లక్షల ఎకరాలకు గాను 15.07 లక్షల మంది ఖాతాల్లోకి జమ కానున్న రూ.1152.46 కోట్లు జమ కానున్నాయి.

రెండవ రోజూ నల్గొండ రైతులే అత్యధికం లక్షా 10 వేల 407 మంది ఉండగా రైతుల ఖాతాలకు రూ.85.23 కోట్లు విడుదలయ్యాయి. రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వ్యవసాయ శాఖ సిబ్బందికి, ఆర్థిక శాఖ సిబ్బందికి ధన్యవాదాలు, తెలంగాణ రైతాంగానికి అభినందనలు తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

- Advertisement -