సెట్స్‌పై మన్మథుడు 2..

602
manmadhudu 2
- Advertisement -

కింగ్ నాగార్జున హిట్ చిత్రాలలో ఒకటి మన్మథుడు. ఐదు పదుల వయసులోనూ కుర్రహీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా గ్లామర్‌ని మెంటైన్ చేస్తూ వస్తున్న నాగ్‌ త్వరలో మన్మథుడు 2గా ప్రేక్షకుల ముందుకురానున్నాడు.

రాహుల్ ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌ర‌కెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ యూరప్‌లో జ‌రుపుకుంటున్న తెలుస్తుంది. తాజాగా చిత్రంలోని ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్న నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, వెన్నెల కిషోర్ మ‌న్మ‌థుడు 2 ఫ్యామిలీ గ్రూప్ ఫోటో షేర్ చేశారు.

ఇందులో నాగ్‌, ర‌కుల్‌,దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌, రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి తదితరులు ఉన్నారు. ఈ పిక్ అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. 2020 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై నాగార్జున, జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -