విడాకులకు అప్లై చేసిన రజనీ కూతురు..

562
- Advertisement -

వెండి తెరపై వారు స్టార్లు. సూపర్‌స్టార్లు. వాళ్లు డైలాగ్స్ చెబితే ఈలలు, కేకలు. స్టెప్పేస్తే అరుపులు. వారి స్టైల్‌కు జనం వీరాభిమానులు. ఇది తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఒకవెలుగు వెలిగిన, వెలుగుతున్న ఇద్దరు ప్రముఖ హీరోల రేంజ్. ఈ ఫీల్డ్‌లో ఉన్న వారు పెళ్లి చేసుకుంటే వారు ఎన్ని రోజులు క‌లిసి ఉంటారో…ఎప్పుడు విడాకులు తీసుకుంటారో ఊహించ‌డం క‌ష్టం. సినిమాల్లోని ట్విస్టుల లాగే ఈ సినిమా వాళ్ల పెళ్లి జీవితాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో ఎవరికీ అర్థం కావు.

ముఖ్యంగా ఇటీవలి కాలంలో తమిళ సినీ ఇండస్ట్రీలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే నటీనటుల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవలే అమలాపాల్- విజయ్ జంట విడాకులు కోసం కోర్టుకెక్కగా మరో రెండు జంటల వైవాహిక జీవితం క్లైమాక్సుకు వచ్చి డివోర్స్ కు సిద్ధంగా ఉన్నాయట. తాజాగా సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ కూతురు విడాకులు తీసుకోబోతోంది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

soundarya ashwin

సూపర్‌ స్టార్ వారసురాలిగా సినీ రంగంలో ప్రవేశించిన సౌందర్య….భారతీయ సినీ చరిత్రలోనే క్యాప్చరింగ్ ఫార్మాట్‌లో తొలి యానిమేషన్ 3డీ చిత్రం కొచ్చడైయాన్‌ను తెరకెక్కించింది. ఈ విధంగా సౌందర్య రజనీకాంత్ అశ్విన్ మొదటి చిత్రంతోనే గొప్ప ప్రయోగం చేశారని చెప్పవచ్చు.

Rajinikanth
చెన్నైకి చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త అశ్విన్ కుమార్‌తో సౌందర్యకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలిసింది. ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరుతూ సౌందర్య పిటిషన్ దాఖలు చేసినట్లు అనధికార సమాచారం. ప్రస్తుతం ఆమె భర్త అశ్విన్ యూఎస్‌లో ఉన్నాడని, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవడం కోసం వెళ్లినట్లు తెలిసింది. అతను రాగానే ఇద్దరూ ఫ్యామిలీ కోర్టులో విడాకులు పొందుతారని కోలీవుడ్‌ వర్గాల టాక్. సౌందర్య పెళ్లి 2010లో అతిరథ మహారధుల సమక్షంలో ఘనంగా జరిగింది.అయితే వీరిద్దరి కుటుంబాలు విడాకులు తీసుకోనివ్వకుండా ఆపుతున్నట్లు సమాచారం. మరి చూడాలి వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది.

rajini_final_2397724f

- Advertisement -