అమలాపాల్, ధనూష్ రిలేషన్షిప్ పై కోలీవుడ్ లో హాట్ టాపిక్ నడుస్తోంది.కష్టాల్లో ఉన్న అమలాపాల్.. ధనూష్ కారణంగా హ్యాపీగా ఉంటోందట. రీసెంట్ గా అమలాపాల్ భర్త విజయ్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల సమయంలో కోర్టు బయట అమలాపాల్ కన్నీరు పెట్టుకుంది కూడా.
దీంతో ఇక అమలాపాల్ పనైపోయింది అనుకున్నారంతా. కానీ ఆమె మాత్రం విడాకుల తరువాత మరింత హ్యాపీగా ఉందట. సమస్యలతో నిండిన వైవాహిక జీవితాన్నితెగదింపులు చేసుకోవడం వలనే అమలాపాల్ సంతోషంగా ఉండగలుగుతోందని, కోలీవుడ్ ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. కష్టకాలంలో ఉన్నఅమలాపాల్ కు తన స్నేహితుడైన ధనూష్ కూడా సహకరిస్తున్నాడట. దీంతో ఊహించని రీతిలో ఈ భామకు బంపర్ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.
ప్రస్తుతం ధనుష్ చేస్తున్న వడ చెన్నై లో అమలాపాల్ నటిస్తోంది. దీని తరువాత రజనీకాంత్ మూవీలోనూ అమలాపాల్ ను ధనూష్ రికమండ్ చేశాడట. పా రజింత్ డైరెక్షన్ చేయనున్న ఈ మూవీని తానే నిర్మిస్తున్నట్లు ధనూష్ ఇప్పటికే ప్రకటించాడు. రోబో2.0 తరువాత ఈ మూవీ ప్రారంభం కానుంది. ధనూష్ తో అమలాపాల్ రఘవరన్ బీటెక్ లో తొలిసారి నటించింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.
ఇప్పుడు వడచెన్నైలో మళ్లీ ఈ జోడి కలిసినటిస్తోంది. ఈ మూవీ టైంలోనే విజయ్- అమలాపాల్ మధ్య విభేదాలు ఏర్పడి, విడాకులకు దారితీసింది. అందుకే ధనూష్.., అమలాపాల్ అండగా ఉంటూ సినిమా ఆఫర్లు ఇస్తున్నాడట. ఇందులో భాగంగానే రజనీతో తాను నిర్మించబోయే మూవీలో అమలాపాల్ కు ధనూష్ అవకాశం ఇచ్చాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.