ముంబైపై పంజాబ్ గెలుపు..

669
KXIP
- Advertisement -

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ విజయం సాధించింది. సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ను ఘోరంగా ఓడించింది. ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన ఐపీఎల్ 9వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచింది. 8 వికెట్ల తేడాతో గెలిచి ఐపీఎల్ 2019 సీజన్‌లో రెండో విజయాన్ని పంజాబ్ తన ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టంతో 176 పరుగులు చేసింది.

ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్(60: 39 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకంతో రాణించడం, కెప్టెన్ రోహిత్ శర్మ(32: 18 బంతుల్లో 5ఫోర్లు), హార్దిక్ పాండ్య(31: 19 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్) స్కోర్‌ను పెంచినా ఫ‌లితం లేకుండా పోయింది.

- Advertisement -