మాణిక్‌రావు మృతిపట్ల కేసీఆర్ సంతాపం

221
kcr
kcr
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మాణిక్‌రావు మృతిపట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. ఈ రోజు ఉదయం ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు కేసీఆర్. మాణిక్‌రావు ప్రభుత్వంలో ఉండి ప్రజలకు చేసిన సేవ చిరస్మరణీయమని కొనియాడారు. మాణిక్ రావు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

మాణిక్‌రావు రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 14 సంవత్సరాల పాటు వివిధ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -