పాలమూరులో కేసీఆర్‌…రంగారెడ్డిలో కేటీఆర్

769
kcr ktr
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓ వైపు సీఎం కేసీఆర్ మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఎంపీ స్ధానాలను క్లీన్ స్వీప్ చేసే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇవాళ సీఎం కేసీఆర్ పాలమూరులో భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనుండగా కేటీఆర్ రంగారెడ్డి జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు.

మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ అభ్యర్థి పీ రాములు తరఫున ప్రచారం చేయనున్నారు కేసీఆర్. మహబూబ్‌నగర్ లోని భూత్పూర్ మండలం అమిస్తాపూర్, వనపర్తి సమీపంలోని నాగవరం వద్ద నిర్వహించనున్న బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు. నాగర్‌కర్నూల్‌లో సభ సాయంత్రం 4 గంటలకు, మహబూబ్‌నగర్ సభ 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఒక్కో సభకు రెండు లక్షలకుపైగా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు.

ఇక కేటీఆర్ సైతం సిరిసిల్ల, పరిగి, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పరిగి అసెంబ్లీ నియోజకవర్గం, రాత్రి 7.30 గంటలకు చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం రోడ్‌షోలలో పాల్గొంటారు.

- Advertisement -