తెలంగాణను చూసి నేర్చుకో..బాబుకు మోహన్ బాబు సలహా

825
ycp mohan babu
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి ద్వజమెత్తారు సినీనటుడు,వైసీపీ నేత మోహన్ బాబు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు అబివృద్ధి అంటే ఏంటో తెలంగాణను చూసి నేర్చుకోవాలని సూచించారు. చంద్రబాబుకు జగన్‌,కేసీఆర్,మోడీని తిట్టడానికే సరిపోతుందన్నారు.

టీడీపీలో బాబు కంటే ముందు తానే సీనియర్‌ని అన్న మోహన్ బాబు ఎవరైన ఎదుగుతుంటే చంద్రబాబు చూసి ఓర్వలేరన్నారు. ఏపీ అప్పుల్లో మునిగిపోవడానికి కారణం చంద్రబాబేనని ఎన్టీఆర్‌ నుండి టీడీపీని లాక్కున్నారని తెలిపారు. యూటర్న్​లైనా తీసుకుంటారని ఎద్దేవా చేశారు. మోడీ ఆంధ్రాకు వస్తే బేడీలు వేస్తానన్న చంద్రబాబు.. నాలుగేళ్లు పొత్తు ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు.

ఏపీలో చంద్రబాబు ,టీడీపీ శకం ముగిసినట్టేనని జోస్యం చెప్పారు. న్టీఆర్ కుటుంబ సభ్యులు అమాయకులు కాబట్టే చంద్రబాబు తేలిగ్గా వారిని మోసం చేశారని విరుచుకుపడ్డారు. వైశ్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్ మీద చంద్రబాబు చెప్పులు వేయించ‌డం తనకు తెలుసని చెప్పారు. ఓటుకు నోట్లు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా దొరికి పారిపోయారని చంద్రబాబును ఎవరూ నమ్మొద్దన్నారు. . వైఎస్ జగన్ ప్రజలకు మంచి చేస్తారని.. ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

- Advertisement -