దేశంలో 31వేలు దాటిన యాక్టివ్ కేసులు

41
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 6155 కేసులు నమోదుకాగా 11 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,47,51,259కి చేరగా 5,30,954 మంది మరణించారు.

ప్రస్తుతం 31,194 కేసులు యాక్టివ్‌గా ఉండగా మొత్తం కేసుల్లో 0.07 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 98.74 శాతం మంది కరోనా నుండి కోలుకోగా 1.19 శాతం మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 5.63 శాతానికి చేరగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -