తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం..

184
Telangana assembly
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీలో మళ్లీ కరోనా కలకలం రేగింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. సమావేశాల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా నెగెటివ్ ఉన్న వారిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ టెస్టులు నిర్వహించారు.ఈ నేపథ్యంలో అసెంబ్లీలో పని చేస్తున్న ఒక ఉద్యోగికి ఈరోజు కరోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో ఆ ఉద్యోగి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌కు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు కొద్దిరోజుల ముందు నిర్వహించిన పరీక్షల్లో ఆ ఉద్యోగికి నెగిటివ్ వచ్చిందని… నిన్న మరోసారి చేయించుకున్న పరీక్షల్లో మాత్రమే పాజిటివ్ అని తేలినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఉద్యోగి నిన్న కూడా అసెంబ్లీలో విధులు నిర్వహించారు. దీంతో, అక్కడ పని చేస్తున్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

- Advertisement -