తెరపైకి కొత్తగా 30 మండలాలు

226
- Advertisement -

దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవిన్యూ డివిజన్లు, కొత్త మండలాలు కూడా సమాంతరంగా ప్రారంభం కావాలని సిఎం కేసిఆర్ తెలిపారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నేపధ్యంలో అధికార యంత్రాంగం కూర్పుపై ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి.లో మంగళవారం సమీక్ష జరిగింది. కొత్త మండలాలను నిర్ధారించాలని, తర్వాత రెవిన్యూ డివిజన్లను కూర్పు చేయాలని సిఎం సూచించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో మొదటిరోజు నుంచే రెవిన్యూ, పోలీస్ శాఖలు పని ప్రారంభించాలని ఆదేశించారు. మిగతా కార్యాలయాలు, అధికారుల నియూమకం కూడా ఆ తర్వాత చేపట్టాలని వివరించారు. మూడు అంచెలలో పరిపాలనా విభాగాల ఏర్పాటు, అధికారుల నియామకం తదితర ప్రక్రియలను కలెక్టర్లు పర్యవేకించాలని చెప్పారు. మండలాల్లో రెవిన్యూ కార్యాలయాలు, ప్లో స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు.

KCR

ఇప్పటికే విడుదల చేసిన డ్రాప్టు నోటిఫికేషన్ పై ప్రజల నుంచి వచ్చిన స్పందన, అధికారులు చేసిన కసరత్తుల ఆధారంగా అవసరమైన మార్పులు చేసి పునర్ వ్యవస్థీకరణకు తుది రూపం ఇవ్వాలని చెప్పారు. ఓ కుటంబం ఇల్లు మారినప్పుడు వచ్చే సమస్యలే, కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా తలెత్తుతాయన్నారు. ప్రారంభదశలో ఎదురయ్యే సహజ సమస్యలను గుర్తించి, పరిష్కరించాలని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా 75 మండలాల కోసం కొత్తగా డిమాండ్లు రాగా, వాటిలో ఇప్పటికే 45 మండలాలను నోటిపై చేసినట్లు సిఎం చెప్పారు. మరో 30 మండలాల కోసం డిమాండ్లు వచ్చాయని, వాటి సాధ్యాసాధ్యాలపై వెంటనే నిర్ణయం జరగాలని చెప్పారు. కొత్తగా ప్రతిపాదించే మండల జనాభా 35 వేలకు పైగా ఉండాలనే నిబంధన పెట్టుకున్నామన్నారు. అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, చెంచులు నివసించే ప్రాంతాలకు సంబందించి జనాభా విషయంలో సడలింపు ఇవ్వాలని సూచించారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త మండలాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

CM KCR

పరిపాలనా విభాగాల ఏర్పాటుకు సంబంధించి సీనియర్ అదికారులు, కలెక్టర్లు, స్లో అదికారులు తము ప్రతిపాదనలను సమావేశంలో వివరించారు. ఉద్యోగుల పెంపు, తగ్గింపు, సర్దుబాటు, ఆయూ శాgుల పనిభారం ఆదారంగా నిర్ణయించాలన్నారు. అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేయడం, ప్రజలకు పాలన చేరువ చేయడం, శాంతి భద్రతల పర్యవేక్షణ తదితర విషయాల్లో మరింత బాగా సేవలందించడానికి అనుగుణమైన వాతావరణం కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రతీ కుటుంబంపై అవగాహన కలిగి వుండడం, పేదలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం, క్షేత్ర స్థాయిలో స్వయంగా పనులు పర్యవేక్షించడం చిన్న పరిపాలనా విభాగాల ఏర్పాటు లక్ష్యమన్నారు.

kcr

జిల్లా యూనిట్లు చిన్నగా వుంటే ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ సులువు అవుతుందన్నారు. ఆయా ప్రాంతాల స్వభావం, సామాజిక పరిస్థితులు, పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వ శాఖల విభాగాలను ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. ఆదిలాబాద్‌లో అంటురోగాలు ఎక్కువ కాబట్టి అక్కడ వైద్య, ఆరోగ్య శాఖను పటిష్టం చేయాలని, ఏజెన్సీ ఏరియూ ఎక్కువ వున్న చోట సంక్షేమ అధికారుల నియామకం ఎక్కువ చేయాలని సిఎం వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు ఎక్కువ అవసరం అని సిఎం వివరించారు. దీనిని బట్టి కొత్త ఉద్యోగులను నియమించాలని సిఎం ఆదేశించారు.

KCR at MCHRD
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, మంత్రులు జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి,డిజిపి అనురాగ్ శర్మ, సీనియర్ ఐఎఎస్ అధికారులు, సీనియర్ ఐపిఎస్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.

- Advertisement -