పెళ్లి తర్వాత చైతూతో కలిసి సమంత చేసిన చిత్రం మజిలీ. ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా గురించి, తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. చైతూతో సినిమా చేయడం తనకసలు ఇష్టంలేదని తెలిపింది సామ్.
ఇద్దరం కలిసి సినిమా చేస్తే భారీ అంచనాలుంటాయి. అయితే ఆ అంచనాలను రీచ్ కాలేకపోతే ప్రేక్షకులకు నిరాశ పడతారు. అందుకే చైతూతో సినిమా చేయడం తనకిష్టం లేదన్నారు. తనకు పెళ్లయి రెండేళ్లయింది. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఉన్న ప్రేమలో తేడాను గుర్తించగలుగుతున్నానని తెలిపింది. పెళ్లయిన తర్వాత ప్రేమలో ఒక అందం ఉంటుందని ఆప్రేమను గుర్తించ గలుగుతుందన్నారు.
తానెప్పుడూ నిన్నటికంటే బెటర్గా ఉండాలనుకుంటా అని చెప్పిన సామ్ రేపు ఈ రోజుకన్నా ఇంకా బావుండాలనుకుంటానని తెలిపింది సమంత. ఈ సినిమాలో శ్రావణి అనే పాత్ర చేశా..ఆ పాత్ర చేయడం ఛాలెంజింగ్గా అనిపించిందన్నారు.
తనకు నచ్చకపోతే ఎన్నిమార్పులు చేసిన ఆ పాత్రను చేయనని ఒకవేళ నచ్చితే అందులో వేలు పెట్టనని తెలిపారు. మజిలీ కథ వినగానే వెంటనే నచ్చి, ఓకే చెప్పా. సినిమా చూసిన తర్వాత శివ చెప్పినదానికన్నా బాగా తీశారని అనిపించిందన్నారు.
గతంలో తనపై వస్తున్న ట్రోల్స్ చూసి బాగా ఫీలయ్యేదానినని కానీ ఇప్పుడు అసలు పట్టించుకోవడం మానేశానని తెలిపారు. కిస్, హగ్, టచ్… స్క్రీన్ పైన ఏదైనా ఒకటే. నేను నటిగా దాన్ని అలాగే చూస్తానంతే. ఎందుకంటే ఆ సీన్కి కిస్ కావాలి. అక్కడ మాటలు దాటిన ఎమోషన్ ఉంది. అందుకే చైతన్య కిస్ చేశారు. ఆ సీన్ చేశారని నాకు ముందు తెలియదు. ఒకరోజు దర్శకుడు శివ సీన్ చూపిస్తే ఓహో కిస్ చేశారా అని అనుకున్నానని చెప్పింది సామ్.