చెన్నై టెస్టు: ఇంగ్లాండ్‌ 134 ఆలౌట్‌..

141
- Advertisement -

చెన్నై వేదికగా చెపాక్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోమారు ఈ సిరీస్ లో 5 వికెట్ల ప్రదర్శన కనబర్చిన వేళ ఇంగ్లండ్ జట్టు 134 పరుగులకే కుప్పకూలింది.

అశ్విన్ 23.5 ఓవర్లలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం ఇవాళ్టి ఆటలో హైలైట్ గా నిలిచింది. కొత్త స్పిన్నర్ అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మకు కూడా 2 వికెట్లు దక్కాయి. సిరాజ్ ఓ వికెట్ సాధించాడు. ఇంగ్లాండ్‌ 59.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్‌ ఇంకా 195 పరుగులు వెనుకబడి ఉంది.

బెన్‌ఫోక్స్‌(42 నాటౌట్‌: 107 బంతుల్లో 4ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. రోరీ బర్న్స్‌(0), డొమినిక్‌ సిబ్లే(16), డేనియల్‌ లారెన్స్‌(9), జో రూట్‌(6), బెన్‌ స్టోక్స్‌(18), ఓలీ పోప్‌(22), మొయిన్‌ అలీ(6) ఆతిథ్య బౌలర్ల దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 329 పరుగులకు ఆలౌటైంది.

- Advertisement -