ఎవరు పని చేయకున్నా కఠిన చర్యలు- మంత్రి హరీశ్

34
Minister Harish
- Advertisement -

శుక్రవారం మెదక్‌ జిల్లాలో 17 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు.. అనంతరం, దళిత బంధు లబ్ధి దారులకు యూనిట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా కలెక్టర్ హరీశ్ మరియు స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఈ ఆసుపత్రి మొత్తం కాన్పుల కోసమే ఏర్పాటు చేశాము. ఇక్కడ చిన్నారుల కోసం మంచి వైద్యం అందుతుంది. సీఎం కేసీఆర్‌ మంజూరు చేసిన ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎంతో చొరవ చూపారని మంత్రి అన్నారు.

ఈ ఆసుపత్రిలో మెటర్నిటీ వార్డ్, లేబర్ రూం, ఆపరేషన్ థియేటర్, పేడియాత్రిక్ వార్డ్, PICU,SNCU,ఆంటి నాటల్ వార్డ్, పోస్ట్ నాటల్ వార్డ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల శాతం పెరగాలి. ముఖ్యమంత్రి మంచి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 నుండి 56 శాతం పెరిగాయి. ఆశాలు మరింత బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రంలో 27వేల మంది ఆశాలు ఉన్నారు. 700 మంది ఉన్న ఆశాల పరిధిలో ఎక్కువ మంది ప్రైవేటు ఆసుపత్రికి వెళుతున్నారు. మేము వీరితో సమీక్ష నిర్వహించాము. సాధారణ డెలివరీ పెరగాలి. దాని వల్ల తల్లికి పిల్లకు లాభం. పుట్టిన బిడ్డకు ముర్రు పాలు మొదటి గంటలో అందాలి.. 36 శాతం చిన్నారులకు మాత్రమే అందుతున్నదని మంత్రి వివరించారు.

సాధారణ డెలివరీఐ మొదటి ఏఎన్‌సి చెకప్ నుండి దృష్టి సారించాలి. సాధారణ కాన్పు కోసం సిబ్బందికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. రాబోయే రోజుల్లో సాధారణ ప్రసవాలకు వైద్య సిబ్బందికి ఇన్సెంటివ్ రు. 3000 ఇస్తామని మంత్రి తెలపారు. ఆశాల పరిధిలో కేసులు ఎక్కువైతే చర్యలు ఉంటాయి. మంచి చేస్తే హైదరాబాద్ పిలిచి సన్మానం చేసినం.. కొందరి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తున్నది మంత్రి గుర్తు చేశారు.కరోనా సమయంలో ఎంతో వైద్య సిబ్బంది కష్ట పడ్డారు. ఎంతో కృషి చేశారు అని కొనియాడారు. అయితే ఎక్కడైనా చిన్న తప్పు జరిగితే అందరూ చేసినట్టు అవుతున్నది. అందుకే ఆ ఒక్కరూ మారండి లేకుంటే చర్యలు ఉంటాయని మంత్రి హరీశ్‌ హెచ్చరించారు. ప్రతి నెల మూడో తారీఖున ఆశలతో టెలి కాన్ఫరెన్స్ ఉంటుంది.. అందరూ సిద్ధంగా ఉండండి. సలహాలు సూచనలు ఇవ్వండి. అమ్మఒడి వాహనం సేవలు మెరుగ్గా అందించాలి. ఎవరు పని చేయకున్నా వారిపై చర్యలు తప్పవు అని మంత్రి హెచ్చరించారు. త్వరలో మెదక్ వస్తా మళ్లీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించుకుందాం అన్నారు మంత్రి హరీశ్‌.

- Advertisement -