జింబాబ్వేతో సిరీస్..వైభవ్‌పైనే భారీ ఆశలు!

4
- Advertisement -

తన అండర్-19 ప్రపంచ కప్ ఘనతలకు సాక్ష్యంగా నిలిచిన హరారే మైదానంలో జింబాబ్వేతో జరగనున్న టి20 (T20I) సిరీస్ కోసం వైభవ్ సూర్యవంశీ మళ్లీ అడుగుపెట్టాడు. అంతర్జాతీయ అరంగేట్రంలో ఆశించిన రీతిలో రాణించలేకపోయిన ఈ టీనేజర్, ఇప్పుడు తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు వైభవ్ భయం లేని ఆటతీరును భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసించారు.

సరిగ్గా నాలుగు నెలల క్రితం జింబాబ్వేలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌లో వైభవ్ సూర్యవంశీ తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బిహార్‌కి చెందిన ఈ యువ సంచలనం కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించి, భారత్‌కు 100 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. ఆ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలవడమే కాకుండా భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇప్పుడు 15 ఏళ్ల ఈ ఆల్ రౌండర్..సీనియర్ జాతీయ జట్టు సభ్యుడిగా అదే మైదానంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌ల తర్వాత కూడా జట్టులో చోటు నిలబెట్టుకున్న వైభవ్, జూలై 23 నుంచి హరారే వేదికగా జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆడనున్నాడు. ఈ సందర్భంగా ఆ మైదానంతో తనకున్న జ్ఞాపకాలను బిసిసిఐ (BCCI) పంచుకున్న ఒక వీడియోలో వైభవ్ వెల్లడించాడు.

Also Read:పేపర్ లీక్‌లపై మోదీ సంచలనం

మేము ప్రస్తుతం జింబాబ్వేలోని హరారేలో ఉన్నాం. ఇది నాకు చాలా ప్రత్యేకమైన మైదానం. సరిగ్గా నాలుగు నెలల క్రితం మేము ఇక్కడే అండర్-19 ప్రపంచ కప్ ఆడి విజేతగా నిలిచాం. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ప్రతి ఒక్కరి కల. అలాంటి గొప్ప మైదానంలో చరిత్ర సృష్టించిన చోట మళ్లీ సీనియర్ జట్టుతో కలిసి ఆడటం నిజంగా ఎంతో ప్రత్యేకమైన అనుభూతి… దీన్ని మేము పూర్తిగా ఆస్వాదిస్తాం అని వైభవ్ తెలిపాడు.

- Advertisement -