హైద‌రాబాద్‌లో జెడ్ఎఫ్ సంస్థ కొత్త మొబిలిటీ కేంద్రం..

90
- Advertisement -

జ‌ర్మ‌నీకి చెందిన జెడ్ఎఫ్ సంస్థ హైద‌రాబాద్‌లో విస్త‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు దావోస్ వేదిక‌గా మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ప్ర‌తినిధులు స‌మావేశ‌మై విస్త‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌పై చ‌ర్చించారు. 3 వేల మందికి ఉద్యోగాలు క‌ల్పిస్తూ విస్త‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను చేప‌ట్ట‌నుంది. నానక్‌రాంగూడ‌లో కొత్త మొబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నుంది.

ఈ మొబిలిటీ కేంద్రాన్ని జూన్ 1వ తేదీన ప్రారంభించ‌నున్నారు.ప్ర‌పంచంలో 100 ఏరియాల్లో, 18 మేజ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ల‌లో త‌మ కార్య‌క‌లాపాల‌ను జెడ్ఎప్ సంస్థ కొన‌సాగిస్తోంది. జెడ్ఎఫ్ సంస్థకు కేటీఆర్ ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

- Advertisement -