చైతు చేసిన యుద్ధంలో భారీ నష్టం…

232
Yuddham Sharanam incurs 11 cr loss to Sai Korrapati
- Advertisement -

ప్రేమమ్ – రారండోయ్ వేడుక చూద్దాం వంటి వరుస హిట్స్ అందుకున్న నాగ చైతన్య కెరీర్ లో మొదటి సారి హ్యాట్రిక్ కొడదామని అనుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కించిన యుద్ధం శరణం ఫైనల్ గా అపజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమా కలెక్షన్స్ లో కూడా నిర్మాతకి చాలా దెబ్బ కొట్టింది. యుద్ధం శరణంతో బాక్స్ ఆఫీస్ యుద్ధం పక్కా అనుకున్న చైతు మొదటి రోజే డీలా పడిపోయాడు.

poster-yuddhamsharanam3

నాగచైతన్య కథానాయకుడిగా ‘యుద్ధం శరణం’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమా నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా యూత్ ను ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన సాయి కొర్రపాటికి 11 కోట్ల వరకూ నష్టం వచ్చినట్టుగా ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాకి చైతూ స్నేహితుడు కృష్ణ మారిముత్తు దర్శకుడిగా వ్యవహరించాడు. తన స్నేహితుడితో సినిమా చేయాల్సిందేనంటూ చైతూ పట్టుబట్టడంతో, ఈ సినిమాకి సంబంధించిన విషయాల్లో నాగార్జున జోక్యం చేసుకోలేదట. అందువల్లనే ఈ సినిమా పరాజయం పాలైందని చెప్పుకుంటున్నారు. తొందరపాటుతో చైతూ తీసుకున్న నిర్ణయం, ఆయన ఖాతాలోకి హ్యాట్రిక్ హిట్ చేరకుండా చేసిందని అంటున్నారు.

Yuddham Sharanam incurs 11 cr loss to Sai Korrapati

ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి మొదట్లో మంచి సినిమాలను తీసి హిట్ అందుకున్నాడు. కానీ ఈ మధ్య కొన్ని ప్రయోగాలు చేసి అనవసరంగా నష్టాన్ని తెచ్చుకుంటున్నాడు. ఇంతకుముందు తీసిన జ్యో అచ్యుతానంద – పటేల్ సర్ వంటి సినిమాలతో భారీ నష్టాలని చూసిన సాయి కొర్రపాటి ఆ మధ్యలో బాహుబలి విశాఖపట్నం డిస్ట్రిబ్యూషన్ హక్కులతో కొంచెం రికవరీ అయ్యారు. కానీ ఇప్పుడు హ్యాట్రిక్ అపజయాన్ని అందుకున్నాడు.

- Advertisement -