వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

455
mopidevi venkataramana
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది వైసీపీ. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మంత్రి మోపిదేవి వెంకటరమణతో పాటు మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డిలను ఖరారు చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వీరి పేర్లను ఖరారు చేశారు సీఎం జగన్‌.

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఆగస్టు 7న నోటిఫికేషన్ వెలువడగా నామినేషన్ల దాఖలుకు ఈ నెల 14 వరకు గడువు విధించారు. ఈ నెల 16న నామినేషన్ల పరిశీలిన, ఆగస్టు 19న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఆగస్టు 26న పోలింగ్ జరిపి.. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నారు.

ఏపీలో కరణం బలరాం, ఆళ్ల నాని , కోలగట్ల వీరభద్ర స్వామి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.

- Advertisement -