వైఎస్ విజ‌య‌మ్మ సంచ‌ల‌న నిర్ణ‌యం..

29
YS Vijayamma
- Advertisement -

వైసీపీ ప్లీన‌రీలో ఆ పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీ గౌర‌వ అధ్య‌క్ష స్ధానం నుండి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. గుంటూరు జిల్లా చిన‌కాకానిలో జ‌రుగుతున్న వైసీపీ మూడో ప్లీన‌రీలో భావోద్వేగంతో ప్ర‌సంగించిన విజ‌య‌మ్మ‌…త్వ‌ర‌లో తెలంగాణ రాజ‌కీయాల్లో క్రియాశీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్లు తెలిపారు.

ష‌ర్మిల‌కు అండ‌గా ఉండేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని అంతా త‌న నిర్ణ‌యాన్ని గౌర‌వించాల‌న్నారు. ఏపీలో జ‌గ‌న్‌, తెలంగాణ‌లో ష‌ర్మిల ప్ర‌జ‌ల కోసం ఉన్నార‌ని రెండు రాష్ట్రాల్లో వారివారి ప్రయోజనాలకు భంగం కలుగకుండా, వక్రీకరణకు, బురద చల్లె రాజకీయాలకు తావు లేకుండా ఉండేందుకు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇటీవల తాను రాయని, చేయని సంతకంతో తాను రాజీనామా చేస్తున్నట్లు వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబ ఎప్పుడూ ప్ర‌జ‌ల మంచే కోరుకుంటుంద‌ని తెలిపారు.

- Advertisement -