జగన్ పై షర్మిల..నవ సందేహాలు!

9
- Advertisement -

ఏపీ సీఎం జగన్‌పై లేఖాస్త్రం సంధించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నవ సందేహాల పేరుతో మరో లేఖను సంధించారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని అన్నారు. మీరు చేసిందేమిటి? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మీ హామీ ఏమయింది?,.ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వలేదు?,నిరుద్యోగులు 7.7 శాతం పెరగడం మీ ప్రభుత్వ వైఫల్యం కాదా?,23 వేలతో మెగా డీఎస్సీ అన్నారు. 6 వేలతో దగా డీఎస్సీ ఎందుకు వేశారు?,యూనివర్శిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదు?,గ్రూప్-2 కింద ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు భర్తీ చేయలేదు?,యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నారు?.జాబు రావాలంటే మీ పాలన పోవాలి అని అంగీకరిస్తారా? అని వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read:GIC:పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్‌ అరణ్య’

- Advertisement -