రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిల‌ర్‌- వైఎస్ ష‌ర్మిల-

72
- Advertisement -

టీపీసీసీ రేవంత్ రెడ్డిపై వైఎస్సార్టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి సామాజిక వ‌ర్గానికి మాత్ర‌మే అధికారం ఇవ్వాల‌న్నట్లు ఇటీవ‌ల ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్ది చేసిన వ్యాఖ్య‌ల‌పై శ‌నివారం వైఎస్ ష‌ర్మిల స్పందించారు. రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిల‌ర్‌గా, ఓ దొంగగా అని ష‌ర్మిల‌ విమర్శలు గుప్పించారు.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అంటూ రేవంత్‌పై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాట‌లు ఇత‌ర కులాల‌ను కించ‌ప‌రిచేవిలా ఉన్నాయ‌ని షర్మిల ధ్వజమెత్తారు.

రెడ్డి సామాజిక వ‌ర్గానికే అధికార ప‌గ్గాలు క‌ట్ట‌బెట్టాలంటే…ఇత‌ర సామాజిక వ‌ర్గాల వారిని కించ‌ప‌రిచిన‌ట్లే క‌దా అంటూ ష‌ర్మిల దుయ్యబట్టారు. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇలా కుల రాజ‌కీయాలు చేస్తుంటే.. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ ఏమైనా చ‌ర్య‌లు తీసుకుందా? అని ఆమె ప్ర‌శ్నించారు. గొప్ప నాయ‌కుడు కావాలంటే కులం అవ‌స‌రం లేద‌న్న ష‌ర్మిల‌… మంచి మ‌న‌సుండాల‌ని, విశ్వ‌స‌నీయ‌త ఉండాల‌ని ఆమె తెలిపారు.

- Advertisement -