కడప పెద్ద దర్గాను సందర్శించిన జగన్‌..

285
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ కాబోయే ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందు ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనతో బిజీగా ఉన్నారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అక్కడి నుంచి నేరుగా కడప చేరుకుని పెద్ద దర్గాను సందర్శించారు. పెద్ద దర్గా వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అమీన్‌పీర్‌ దర్గాలోకి ప్రవేశించిన వైఎస్‌ జగన్‌కు దర్గా మతపెద్దలు సాంప్రదాయరీతిలో తలపాగా చుట్టారు. దర్గాలో వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. చాదర్‌ సమర్పించారు.

YS Jagan

అనంతరం వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొంద‌డంతో చ‌ర్చి పాస్ట‌ర్లు జ‌గ‌న్‌ను ఆశ్వీర‌దించారు.అనంతరం ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, దివంగత నేత వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. సాయంత్రం తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.

- Advertisement -