రేపు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్

390
ys jagan
- Advertisement -

ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ,హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.

రేపు సాయంత్రం ప్రధానితో భేటీ సందర్భంగా ఏపీ మూడు రాజధానులు,అమరావతి, శాసనమండలి రద్దు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానితో భేటీ అనంతరం అమిత్‌ షాతో సమావేశం కానున్నారు జగన్‌. ఓ వైపు అమరావతి తరలింపుపై ఆందోళనలు జరుగుతుండగానే ఏపీ సీఎం హస్తిన టూర్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -