Trivikram:త్రివిక్రమ్ కు కుర్ర హీరోలే దిక్కు?

22
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ” గుంటూరు కారం “. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ మూవీ భారీ అంచనాల మద్య విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మూవీకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికి మహేష్ బాబు ఇమేజ్ తో భారీ కలెక్షన్లే సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీతో త్రివిక్రమ్ డైరెక్షన్ పై నెగిటివిటీ బాగానే పెరిగింది. గురూజీలో దర్శకత్వ ప్రతిభ తగ్గిందని, ఆయన డైలాగ్స్ లో పదును తగ్గిందని.. ఇలా చాలానే విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే తన నెక్స్ట్ మూవీతో నైనా త్రివిక్రమ్ కాం బ్యాక్ ఇవ్వాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తన తరువాతి సినిమాను ఏ హీరోతో చేస్తాడనేది సస్పెన్స్ గా ఉంది. గుంటూరు కారం సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్ తో మూవీ అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. .

అయితే గుంటూరు కారం రిజల్ట్ తర్వాత బన్ని త్రివిక్రమ్ ను పక్కన పెట్టి తమిళ్ డైరెక్టర్ అట్లీతో మూవీ చేసేందుకు సిద్దమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తనకు మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను ఇచ్చిన గురూజీని బన్నీ లైట్ తీసుకునే అవకాశం లేదు. అందువల్ల పుష్ప2 తరువాత అట్లీ ప్రాజెక్ట్ ముందుకు తీసుకొస్తాడా లేదా త్రివిక్రమ్ తోనే చేస్తాడా అనేది సస్పెన్స్ గానే ఉంది. ఒకవేళ అట్లీ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకొస్తే.. త్రివిక్రమ్ మరో ఏడాది వెయిట్ చేయాల్సిందే. దీంతో టైర్ టూ హీరోలలో ఎవరో ఒకరితో మూవీ చేసే ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రమ్. నాని లేదా శర్వానంద్ వంటి హీరోలతో మూవీ చేసి మళ్ళీ స్ట్రాంగ్ కాం బ్యాక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించేందుకు కుర్ర హీరోలు తెగ ఇంట్రెస్ట్ చూపుతున్నారు మరి కుర్ర హీరోల వపే మొగ్గు చూపుతాడా లేదా స్టార్ హీరోతోనే చేస్తాడా అనేది సందిగ్ధంలోనే ఉంది. మొత్తానికి గుంటూరు కారం మూవీ తర్వాత స్టార్ హీరోలు గురూజీకి దూరమైనట్లేననే టాక్ వినిపిస్తోంది. మరి గురూజీ నెక్స్ట్ ఎవరితో మూవీ చేస్తాడో చూడాలి.

Also Read:‘భరతనాట్యం’..విజయం సాధిస్తుంది

- Advertisement -