యంగ్ హీరో నితిన్ గత కొద్ది రోజులుగా ప్లాప్ లతో సతమతమవుతన్నాడు. ఆయన కెరీర్ ప్రారంభంలో హిట్ సినిమాలు వచ్చినప్పటికి ఇష్క్ సినిమా బ్లాక్ బ్లాస్టర్ తో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈమూవీతోనే ఆయనకు లవర్ బాయ్ గా పేరు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘అ ఆ’ సినిమాలు ఘన విజయం సాధించాయి. నితిన్ తాజాగా నటించిన మూడు సినిమాలు అంత పెద్దగా ఆదరణ పొందలేదు.
లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం ఇలా వరుసగా మూడు సినిమాల డిజాస్టర్లు గా నిలిచేసరికి మళ్లీ అయోమయంలో పడిపోయాడు నితిన్. శ్రీనివాస్ కళ్యాణం మూవీ విడుదలయ్యి ఆరు నెలలు దాటినా ఇంతవరకూ తన తర్వాతి ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. గత ఆరు నెలలుగా నితిన్ సైలెంట్ ఉండిపోవడంతో ఆయన అభిమానులు నిరాశలో ఉన్నారు. తాజాగా ఈవిషయం తెలుసుకున్న నితిన్ అభిమానులకు క్షమాపణలు కోరారు.
ఈ నెలాఖరులో కొత్త సినిమాల గురించి ప్రకటన చేస్తానని హామి ఇచ్చారు. అలాగే కొత్త సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని ఈ ఏడాదిలో రెండు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నానని నితిన్ తెలిపారు. ప్రస్తుతం నితిన్ ఛలో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే సినిమాను చేయనున్నారు. త్వరలోనే ఈప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
For all those asking..wil update about my future projects by the end of this month..PAKKA PROMISE..shoot wil also start soon!!all are in scripting stages..plannin for 2 releases this year..sorry for the delay and thank u for being patient
LOVE YOU ALL
— nithiin (@actor_nithiin) March 6, 2019