యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం..

33
- Advertisement -

యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, సాధుసంతులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ నటులు కూడా తళుక్కుమన్నారు.

ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ చేత గవర్నర్ ఆనంది బెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా బ్రిజేష్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రమాణ స్వీకారం చేశారు. యూపీలో గత 37 ఏళ్లలో వరుసగా రెండు పర్యాయాలు సీఎం అయిన వ్యక్తి యోగి ఒక్కరే. యోగి 52 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గాను బీజేపీ 255 చోట్ల జయభేరి యోగించింది.

- Advertisement -