ఏడు చేపల కథ..టీజర్‌

264
Yedu Chepala Katha Teaser
- Advertisement -

మీటూ ఉద్యమం దేశాన్ని ఉపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు “మీటూ” ఉద్యమం ద్వారా ఎంతోమంది మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపుల్ని బహిరంగంగా చెబుతూ కొంతమందికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కానీ ఇక్కడ టెమ్ట్ రవి మీటూ అంటూ ముందుకొస్తున్నాడు. “ఏడు చేపల కథ” చిత్రంలో టెమ్ట్ రవి అనే విభిన్నమైన పాత్రతో
మెప్పించబోతున్నాడు.

అడల్డ్ కామెడీ జోనర్ లో కొత్త వారితో నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ అందరిని ఆకట్టుకోగా తాజాగా సినిమా టీజర్‌కు సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ నెల 26న(రేపు) సాయంత్రం 5.01 గంటలకు ఏడు చేపల కథ టీజర్ విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది.

అభిషేక్ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు.

ఇప్పటివరకు ఈ తరహా ఫస్ట్ లుక్ పోస్టర్ రాలేదనే ప్రశంసలు దక్కుతున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్ని పోలిన విధంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు శామ్ జే చైతన్య విభిన్నమైన కాన్సెప్ట్ ను రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా మలిచాడు. ఆద్యంతం ఆసక్తి కలిగించే సన్నివేశాలతో ఏడు చేపల కథ అందరిని ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

నటీనటులు అభిషేక్ రెడ్డి, భానుశ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్,సాంకేతిక వర్గం బ్యానర్ – చరిత సినిమా ఆర్ట్స్,సమర్పణ – డా.రాకేష్ రెడ్డి,నిర్మాతలు – శేఖర్ రెడ్డి, జివిఎన్,సహ నిర్మాత – గుండ్ర లక్ష్మీ రెడ్డి,సంగీతం – కవి శంకర్, కెమెరా – ఆర్లీ, పిఆర్ఓ – ఏలూరు శ్రీను, రచన, దర్శకత్వం – శామ్ జే చైతన్య.

- Advertisement -