కాంగ్రెస్‌లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

11
- Advertisement -

ఏపీ కాంగ్రెస్‌లో చేరారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్. త్వరలో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల కానుండగా ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా టికెట్లు దక్కని నేతలు వలస బాటపట్టారు. ఈ క్రమంలోనే నందికొట్కూర్ వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధ‌ర్…షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల ఆయ‌న‌కు కాంగ్రెస్ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. వైసీపీ జాబితాలో ఆర్దర్‌కు చోటు దక్కలేదు. దీంతో నందికొట్కూర్ నుంచి కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసే అవకాశం ఉంది.

Also Read:రాజమండ్రిలో 1920 భీమునిపట్నం

- Advertisement -