మంత్రి ఆనంతో బుట్టా రేణుక భేటీ

17
- Advertisement -

వైసీపీ నేత బుట్టా రేణుక…మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో ఆమె పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక పోటీ చేసి గెలిచారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు. అయితే 2019 ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలో చేరిన పోటీ చేసే అవకాశం రాలేదు.

ఇక గత ఎన్నికల్లో ఎమ్మిగనూరు అసెంబ్లీ నుండి పోటీ చేసిన ఓడిపోయారు. తాజాగా ఆనంతో భేటీ కావడంతో ఆమె పార్టీ మార్పుపై పుకార్లు షికార్ చేస్తున్నాయి. బుట్టా బాటలోనే విడుదల రజనీ సైతం పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది.

ఆమె బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. మరికొంతమంది నేతలు సైతం వైసీపీ వీడేందుకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోండగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read:కల్కి..అఫీషియల్ రన్ టైం!

- Advertisement -