వైయస్ ‘యాత్ర’ ట్రైలర్ వచ్చేసింది‌..

257
- Advertisement -

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉన్న సన్నివేశాలు, డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి.

Yatra

ఈ సమాజంలో అన్నింటికన్నా పెద్ద జబ్బు పేదరికం అనే డైలాగ్ జనాల మనసులను తాకేలా ఉంది. ఈ సినిమాలో జగపతిబాబు, సుహాసిని, సుధీర్ బాబు, రావు రమేష్, అనసూయ, పోసాని కృష్ణమురళి తదితరులు నటించారు. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ పాత్రలో ‘ఆశ్రిత వేముగంటి’ నటించింది. ఆమెకి సంబంధించిన ఫస్టులుక్‌ను కూడా ఈ రోజు విడుదల చేశారు. ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకానుంది.

- Advertisement -