పటాస్ నుంచి మమ్మళ్లి గెంటేశారుః యాదమ్మ రాజు, ఎక్సెప్రెస్ హరి

474
Patas
- Advertisement -

బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షోలలో బాగా పాపులర్ అయిన్ షో పటాస్. యాంకర్ శ్రీముఖి, రవిలు ఈషోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ జోడి కోసం కూడా కొంత మంది ఈషోను వీక్షిస్తుంటారు. ఈ షో ద్వారా చాలా మంది కమెడీలన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అందులో ముఖ్యంగా ఫేమస్ అయిన వాళ్లు యాదమ్మ రాజు, ఎక్స్ ప్రెస్ హరి, నూకరాజు, సద్దామ్ హుస్సెన్ పలువురు ఉన్నారు.

అయితే చాలా మంది కొత్త వారు వస్తుండటంతో కొంత మంది పాత వాళ్ళకు అవకాశాలు రావడం లేదు. తాజాగా తమను పటాస్ షో ను తీసేశారంటూ ఫేస్ బుక్ లైవ్ లో తెలిపారు యాదమ్మ రాజు, ఎక్స్ ప్రెస్ హరి. తమకు లైఫ్ ఇచ్చిన పటాస్ నుంచి తమను తిసేయడం బాధాకరం అన్నారు. పటాస్ వల్లే తాము ఈరోజు ఈస్టేజ్ లో ఉన్నామని తెలిపారు. ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

పటాస్ కు గుడ్ బై చెప్పాల్సిన రోజు వస్తుందని తాము ఎప్పుడు అనుకోలేదన్నారు. ఎక్స్ ప్రెస్ హరి పటాస్ కు రైటర్ గా కూడా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు వీరందరిని పటాస్ నుంచి పంపించడానికి కారణం రవి శ్రీముకి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. చూడాలి ఈ వీడియోపై రవి , శ్రీముఖి ఏవింధగా స్పందిస్తారో.

- Advertisement -