యాదాద్రిలో కొనసాగుతున్న భక్తుల దర్శనాలు..

271
yadadri
- Advertisement -

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఆలయాల్లోకి భక్తులకు అనుమతి ఇవ్వడంతో దేవుడి దర్శనాలు సజావుగా సాగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వరుసగా రెండో రోజు భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నరు.

తెలంగాణ నలుమూలల నుంచి హైదరాబాద్ జంట నగరాల నుంచి భక్తులు తరలివచ్చి సామి వారి చూసి తరిస్తున్నరు. ఆలయ అధికారులు అడుగడుగునా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

భక్తులు భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేశారు.. హ్యాండ్ శాని టైజర్ లను అందుబాటులో ఉంచారు..థర్మల్ స్క్రినింగ్ టెస్ట్ లు చేసిన తర్వాతే భక్తులు ను ఆలయంలోకి అనుమతి ఇస్తున్నారు….

- Advertisement -