ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రం ప్రారంభం..

459
meditation centre
- Advertisement -

నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలో 30 ఎకరాల్లో రూపుదిద్దుకున్న కన్హా శాంతివనం నేడు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్, హార్ట్ ఫుల్ నెస్ గ్లోబల్ గైడ్ దాజీతో కలిసి ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. మొత్తం 1400 ఎకరాల్లో హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ ఏర్పాటు కాగా, 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. ఒక సెంట్రల్‌హాల్‌, 8 సెకండరీ హాల్స్‌ చొప్పున మొత్తం 9 హాల్స్‌ను నిర్మించారు. ఇందులో ఒకేసారి లక్ష మంది ధ్యానం చేసుకోవడానికి వీలుంది.

ప్రారంభోత్సవం అనంతరం ఈ కేంద్రంలో యోగా గురు రాందేవ్‌బాబా పర్యవేక్షణలో ఫిబ్రవరి 9వ తేదీ వరకు మూడు విడుతలుగా సామూహిక ధ్యాన కార్యక్రమాలను నిర్వహిస్తారు. నేటి నుంచి 30 వరకు తొలి విడత కార్యక్రమాలు, ఫిబ్రవరి 2 నుంచి 4వరకు రెండో విడత, ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు మూడో విడత కార్యక్రమాలు జరుగనున్నాయి. నేటి ప్రారంభోత్సవం కార్యక్రమంలో బాబా రాందేవ్, పలు రాష్ట్రాల గవర్నర్లు పాల్గొననున్నారు. కాగా, ఫిబ్రవరి 2న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, 7న సామాజిక కార్యకర్త అన్నా హజారే హాజరు కానున్నారు.

ఈ కార్యక్రమాల్లో దాదాపు 1.2 లక్షల మంది పాల్గొననున్నారు. నేడు కన్హా శాంతివనం ప్రారంభోత్సవం సందర్భంగా ఒకేసారి 40 వేల మంది ధ్యానం చేయనున్నారు. హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ మొదటి గైడ్‌ లాల్జీకి ఈ ధ్యానకేంద్రాన్ని అంకితమివ్వనున్నారు.

- Advertisement -